తెలంగాణ ఫలితాల లైవ్ అప్డేట్స్
నిజామాబాద్ అర్బన్ 8వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 3 వేల 188ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ వెనకంజ
సూర్యాపేట నియోజకవర్గంలో ఐదో రౌండ్ ముగిసే సరికి మంత్రి జగదీష్ రెడ్డి ఆధిక్యం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పై 3 వేల 373 ఓట్ల ఆధిక్యంతో జగదీష్ రెడ్డి..
తెలంగాణలోని బీజేపీ ముఖ్యనేతలు వెనుకంజలోఉన్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ వెనుకంజలో ఉండగా, హుజురాబాద్ లో,గజ్వేల్ లో ఈటల రాజేందర్ వెనుకబడిపోయారు. రఘునందన్ రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ లోని గోషామహల్ లో రాజాసింగ్ స్వల్ప మెజార్టీతో కొనసాగుతున్నారు.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి. 6 వేల 611 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి