పోల్ మేనేజ్మెంట్ లో పీహెచ్డీ చేసిన దయాకర్ రావు

పోల్ మేనేజ్మెంట్ లో పీహెచ్డీ చేసిన దయాకర్ రావు
  • 9న నామినేషన్ వేయనున్న యశస్విని 
  • కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి

పాలకుర్తి, ముద్ర: పోల్ మేనేజ్మెంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు పిహెచ్డి చేశాడని కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. దయాకర్ రావు 1983 నుంచి ఎన్నికల రణరంగంలో ఉన్నారని అతను పోల్ మేనేజ్మెంట్ చేయడంలో పీహెచ్డీ  చేశారన్నారు. యశస్విని ఓటు హక్కు పై వస్తున్న రూమర్లను పాలకుర్తి ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. ఈనెల 9న నామినేషన్ వేస్తున్నామని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో దయాకర్ రావు ఓటమి కాంగ్రెస్ విజయం ఖాయమని స్పష్టం చేశారు. పాలకుర్తి ప్రజలు ఎవరికి భయపడవద్దని ఎన్నికల్లో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పాలకుర్తిలో అభివృద్ధి లేదని రాబోవు రోజుల్లో పాలకుర్తిని అభివృద్ధి చేస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ కాకిరాల హరిప్రసాద్, టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్, నాయకులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, సోమ రాజశేఖర్, మెరుగు మల్లేశం, అనుముల మల్లారెడ్డి, చిలువేరు కృష్ణమూర్తి, గంగు కృష్ణమూర్తి, పులి గణేష్,  కార్పోతుల శ్రీనివాస్, గోనె అశోక్, గోనె మహేందర్ రెడ్డి, సురేష్ నాయక్, నెమరుగమ్ముల వెంగళరావు, మేకల కుమార్, నల్ల శ్రీరాములు, బైరు భార్గవ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.