Breaking : పిల్లల ఆహారంలో చక్కెర జోడిస్తున్న నెస్లే

Breaking : పిల్లల ఆహారంలో చక్కెర జోడిస్తున్న నెస్లే

న్యూఢిల్లీ (New Delhi) :  ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే (Nestle) సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పిల్లల ఆహారంలో చక్కెర (SUAGAR) ను జోడిస్తున్న విషయం వెల్లడైంది. పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనలో ఈ విషయం స్పష్టం చేసింది. అయితే, బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో చక్కెర రహిత ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ సంస్థ భారత్ (INDIA) లో ఎక్కువగా అమ్ముడయ్యే పాలు (MILK), సెరెలాక్ (CERELAC) వంటి పదార్థాలలో చక్కెర, తేనెను జోడిస్తున్నట్టు తెలిపింది.

    చిన్నారులకు అందించే ఉత్పత్తులలో అంతర్జాతీయ నిబంధనల మేరకు చక్కెర జోడించకూడదు. దీనివల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అయితే, ఆసియా, ఆఫ్రికా, లాటిన అమెరికా వంటి దేశాలలో నెస్లే ఈ నిబంధనను పూర్తిస్థాయిలో ఉల్లంఘిస్తున్నట్టు ఆ సంస్థ తేల్చింది. ఈ వార్తలపై స్పందించిన నెస్లే, గత అయిదేళ్లలో భారత్ లోని చిన్నారుల ఆహార ఉత్పత్తులలో చక్కెర శాతాన్ని 30 శాతం మేరకు తగ్గించామని, ఉత్పత్తులను నిరంతరం సమీక్షిస్తూ, చక్కెర శాతాన్ని తగ్గించడానికి మార్పులు, చేర్పులు చేస్తున్నట్టు ప్రకటించింది.

      అయితే, పబ్లిక్ ఐ నివేదిక ప్రకారం, నెస్లే భారత్‌లో విక్రయిస్తున్న సెరెలాక్ ఉత్పత్తుల్లో సగటున ఒక్కో సెర్వింగ్‌కు మూడు గ్రాముల చక్కెర ఉంటోంది. అదే, థాయ్ ల్యాండ్, ఇథియోపియా వంటి దేశాలలో విక్రయిస్తున్న ఉత్పత్తులలో చక్కెర స్థాయి సెర్వింగ్‌కు ఆరు గ్రాములుగా ఉందని తేల్చింది. చాలా సందర్భాల్లో ఆయా ఉత్పత్తుల్లో చక్కెర స్థాయిలను ప్యాకేజింగ్‌పై ముద్రించడం  కూడా లేదని పబ్లిక్ ఐ పేర్కొంది. ఇవే ఉత్పత్తుల్ని నెస్లే.. చక్కెర లేకుండా ఐరోపాలో విక్రయిస్తోందని ఆ సంస్థ వెల్లడించిన నివేదికలో పేర్కొంది.
     చక్కెర వ్యసనంగా మారే అవకాశం ఉంది. అందుకే చిన్న పిల్లల ఉత్పత్తులకు దీన్ని జత చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ‘‘తియ్యదనానికి అలవాటు పడ్డ చిన్నారులు, అలాంటి ఆహారంవైపే మొగ్గుచూపుతారు. ఫలితంగా చిన్నతనంలో శరీరానికి తగిన పోషకాలు అందక పెద్దాయ్యాక అనారోగ్యాల బారిన పడే అవకాశం పెరుగుతుందని, అంతేకాకుండా ఊబకాయం కూడా పెరుగుతుందని ’’ అని బ్రెజిల్‌కు చెందిన ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు.