CPI మాజీ కామ్రేడ్ ఈర్ల నర్సింహా పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..

CPI మాజీ కామ్రేడ్ ఈర్ల నర్సింహా పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలంలోని వెల్గొండ గ్రామంలో నిన్న CPI మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఈర్లా నర్సింహా అనారోగ్యంతో మరణించడంతో,ఈరోజు నివాసంలో వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ వెల్గోండ గ్రామ సర్పంచ్ గా,ఎంపీటీసీ గా, గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేశారు అని అన్నారు,వారి మరణం చాలా బాధాకరం అని అన్నారు,ఇర్ల నర్సింహా మరణం తనకు, నాగర్ కర్నూల్ ప్రజలకు తీరనిలోటని అన్నారు.సుదీర్ఘకాలం నిస్వార్థంగా ప్రజా జీవితాన్ని గడిపారన్నారు పేద ప్రజలకు అండగా నిలుస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారని ఆయన కొనియాడారు,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.