కాంగ్రెస్‌ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

కాంగ్రెస్‌ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది : సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

తిరుపతి : ఏపీలో కాంగ్రెస్‌  పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందని వైసీపీ అధినేత,  సీఎం జగన్‌ మోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం తిరుపతిలో ఇండియాటుడే విద్యా సదస్సుకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విడదీసింది. గతంలో మా బాబాయిని మంత్రిని చేసి మాపై ప్రయోగించింది. ఇప్పుడు మళ్లీ మా కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోంది. నా సోదరిని ఏపీ అధ్యక్షురాలిగా చేసి నాపై ప్రయోగిస్తోంది.

విభజించి పాలించడమే ఆ పార్టీ నిత్య విధానం. కాంగ్రెస్‌ గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఆ పార్టీకి మరోసారి దేవుడు గుణపాఠం చెబుతాడు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి నుంచి దిగిపోయినా బాధపడను. వైసీపీ మేనిఫెస్టోలోని 99శాతం హామీలు నెరవేర్చాం. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మా పార్టీయే గెలుస్తుంది. ఏపీ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. సర్వేల ఆధారంగానే వైసీపీ లో టికెట్ల కేటాయింపు అని జగన్‌ వివరించారు.