ఐజేయు జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి గారికి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సన్మానం

ఐజేయు జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి గారికి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా సన్మానం

ముద్ర,హైదరాబాద్:- ఐజేయు జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా  నియమితులైన సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి పేపర్ శ్రీను,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి గారి హయాంలో జర్నలిస్టులకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గత పది ఏళ్లుగా జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మంచి చేసేందుకు చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు చర్యలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.