మంత్ ఆఫ్ మధు” ఫీల్ గుడ్ మూవీ

మంత్ ఆఫ్ మధు” ఫీల్ గుడ్ మూవీ


నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మంత్ ఆఫ్ మధు”. విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి, హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

 ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీకాంత్ నాగోతి నవీన్ తో చేసిన భానుమతి & రామకృష్ణ కి చాలా మంచి పేరు వచ్చింది. ఐతే ఆ చిత్రానికి ఇంకా పేరు రావాల్సిందని నాకు అనిపించింది. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు చిత్రం కూడా యూనివర్సల్ గా వుంటుంది. ఈ మధ్య కాలంలో చూసిన బెస్ట్ ట్రైలర్  మంత్ ఆఫ్ మధు.  అన్ని సినిమాలు వేరు ఈ సినిమా వేరని ట్రైలర్ లోనే తెలుస్తుంది. శ్రేయాకి ఆల్ ది బెస్ట్. స్వాతికి నాకు ఓ కామన్ పోలిక వుంది. నాకూ పన్నుమీద పన్ను వుంటుంది. కొంతమంది నన్ను స్వాతితో పోలుస్తారు(నవ్వుతూ). హర్ష కూడా చాలా కీలక పాత్రలో కనిపిస్తున్నారని అర్ధమౌతుంది. రవికాంత్ ఎడిటింగ్ చాలా బావుంది. అచ్చు చేసిన పాటలన్నీ చాలా బావున్నాయి. నవీన్ నాకు ఎప్పటినుంచో మంచి స్నేహితుడు. ఇందులో తన నటన అద్భుతంగా వుంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. చాలా మంచి టీం కలిసి చేసిన సినిమా ఇది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి'' అని కోరారు.