‘నాతో నేను’ సాంగ్ లాంచ్

‘నాతో నేను’ సాంగ్ లాంచ్

సాయికుమార్‌, శ్రీనివాస్‌ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజపుత్‌, ఐశ్వర్య రాజీవ్‌ కనకాల కీలక పాత్రధారులుగా  శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. ఈ చిత్రం 'ఓసిని వయ్యారి రామ చిలుక' అంటూ సాగే లిరికల్ వీడియోను ఆది సాయికుమార్ విడుదల చేసారు. ఆది మాట్లాడుతూ ‘‘ఈ మధ్యన నాన్న కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఇందులో అయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫీల్ గుడ్ సినిమా అని, తన పాత్ర కొత్తగా ఉంటుందని నాన్న చెప్పారు. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తాజాగా విడుదల చేసిన పాట నాకు బాగా నచ్చింది. లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు. ‘‘జబర్దస్త్‌ కమెడీయన్‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి దర్శకుడిగా తొలి ప్రయత్నం చేశాను. కథ, మాట, పాటలు నేనే రాసుకుని చక్కని నిర్మాతల సహకారంతో ఈ సినిమా పూర్తి చేశాం. బిజీలో కూడా ఆది గారు మా సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో సాయి కుమార్ పాత్ర కొత్తగా ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయన పాత్ర ఏడిపించేంత ఎమోషనల్ గ ఉంటుంది" అని దర్శకుడు చెప్పారు.