ఫిలించాంబర్ కు శరత్ బాబు భౌతిక కాయం
సీనియర్ నటుడు శరత్ బాబు భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని ఫిలించాంబర్ కు తీసుకువస్తారు. ఫిలించాంబర్ కు తీసుకువచ్చేందుకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు. సినిమా ప్రముఖుల సందర్శనార్థం పార్థివ దేహాన్ని అక్కడ ఉంచుతారు. శరత్ బాబు మరణ వార్త దిగ్బ్రాంతి కలిగించింది. ఆయన మృతి సినీరంగానికి తీరని లోటు. శరత్ బాబు ఆత్మశాంతి కోసం ప్రార్ధిస్తున్నాను అన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంచి మనిషి , అజాత శత్రువు అయినా శరత్ బాబు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.