'కెప్టెన్ మిల్లర్' లో  షూటింగ్ పూర్తి

 'కెప్టెన్ మిల్లర్' లో  షూటింగ్ పూర్తి

హీరో ధనుష్  హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. 2023లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ 1930-40ల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. ఈ  పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. తాజాగా ఆమె పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ పోస్టర్ లో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ కు పాయింట్ బ్లాంక్ లో గన్ గురి పెట్టినట్లు కనిపించింది. ఈ చిత్రాన్ని టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ ,అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.