విపక్షాలది స్వార్థపూరిత కూటమి

విపక్షాలది స్వార్థపూరిత కూటమి

ఢిల్లీ: విపక్షాలది స్వార్థపూరిత కూటమి అని, ఇలాంటి కూటములను ఎదుర్కొనడం తమకు కొత్తేమీ కాదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా గురువారం ఆరోపించారు. 2014–2019లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినా వాటిని తిప్పికొట్టామని, ప్రజలు మళ్లీ మోడీ సర్కార్​కే పట్టం కట్టారని గుర్తుచేశారు. ముచ్చటగా మూడోసారి కూడా ఇదే జరగనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుతానికి కూటమి తమ బలం, ఐక్యతను చూపుతున్నా, తీరా ఎన్నికలు దగ్గరికొచ్చే సరికి వారిలో వారే పదవుల పందేరంపై కీచులాడుకొని విడిపోవడం ఖాయమన్నారు. విపక్ష పార్టీల్లో అవినీతి కేసులు, ఆరోపణలు, కుంభకోణాల పార్టీలే ఉన్నాయన్నారు. దేశ భద్రతకు, సమగ్రతతకు ఏ మాత్రం విలువనీయని కూటమి ఇదని సంబిత్​ విమర్శించారు.