యువ బ్రహ్మ శక్తి తెలంగాణ అధ్యక్షునిగా రామేశ్వర్ శర్మ

 ముద్ర,  ప్రతినిధి : సిద్దిపేట: యువ బ్రహ్మ శక్తి ఆధ్వర్యంలో ఆదివారం వర్చువల్ మీటింగ్ జరిగింది. అందులో భాగంగా తెలంగాణ నూతన కమిటీని ఆవిష్కరించారు. అందులో సిద్దిపేటకు చెందిన రామేశ్వర్ శర్మను తెలంగాణ అధ్యక్షునిగా ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా దినేష్ శర్మ, సెక్రటరీగా నరేష్ పండే, కోశాదికారి నట్వర్లాల్ వ్యాస్ తో పాటు ఎన్నుకున్నట్లు   కమిటీ యువ బ్రహ్మ శక్తి  అధ్యక్షులు యోగేష్ పురోహిత్ వెల్లడించారు.  భారతదేశంలోని అందరు బ్రాహ్మణులు ఏకం కావడమే లక్ష్యంగా బ్రహ్మ శక్తి కృషి చేస్తుందన్నారు. అవసరం వచ్చినప్పుడు కష్ట సుఖాలలో నిలబడతామని అధ్యక్షులు యోగేష్ పురోహిత్ చెప్పారు.