బహుజన రాజ్య స్థాపనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలి

బహుజన రాజ్య స్థాపనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలి
  • బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-బహుజన రాజ్య స్థాపనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్ర కులాలలోని పేదలంతా ఏకం కావాలని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం సాధించిన నాడే బహుజనుల బతుకులు మారతాయని బహుజన సమాజ్ పార్టీ సూర్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ అన్నారు.

రాగం సైదులు, ఆరె గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవు దొడ్డి మహేష్  ఆధ్వర్యంలో పిల్లలమర్రి ఆరెగూడెం గ్రామాల నుండి దాదాపు 200 మంది బహుజన్ సమాజ్ పార్టీ (bsp) లో బుధవారం సూర్యాపేట బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ సమక్షంలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ బహుజన రాజ్య స్థాపనకు బహుజన బిడ్డలు అంతా ఏకం కావాలని సూర్యాపేట నియోజకవర్గం నుండి బహుజన రాజ్యాధికారానికి  కృషి చేయాలని కోరారు. బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని గడీల పాలనను అంతం చేయడానికి సూర్యాపేట నియోజకవర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండెబోయిన శ్రీశైలం,మోదాల జానయ్య, పిల్లలమర్రి  ఆరెగూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.