ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలను విజయవంతం చేయాలి

ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలను విజయవంతం చేయాలి
  • ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సాహితీవేత్తలు


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 16 ,17 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బుద్దల కన్వెన్షన్ హాల్లో నిర్వహించే తెలుగు సాహిత్య కళ ఉత్సవాలను విజయవంతం చేయాలని మనం వికాస్ వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ పిలుపునిచ్చారు. పట్టణానికి చెందిన కవులు కళాకారులు శనివారం పట్టణంలోని సుధా బ్యాంకు ఆడిటోరియంలో ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 30 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల నాన్ స్టాప్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కవులను కళాకారులను ప్రోత్సహించేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.  కళా వేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ చైర్మన్ కత్తిముండ ప్రతాప్ నిర్వహించే వివిధ సకల కల ప్రదర్శనలను కళాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు పోతుగంటి వీరాచారి, కవి రచయిత హమీద్ ఖాన్, సింగర్ దాచేపల్లి లక్ష్మి, ప్రముఖ కార్టూనిస్టులు పల్లె మణి బాబు, ఆనంద్, దైదా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.