గ్రామాల్లో తీవ్రమవుతున్న కోతుల బెడద

గ్రామాల్లో తీవ్రమవుతున్న కోతుల బెడద
  • వెలుగు పల్లి లో మహిళపై కోతి 
  • దాడి చేతి పై గాయాలు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రజలుఆరోపిస్తున్నారు. కోతులు తమ ఆహారం కోసం ఇళ్లలో జొరబడి నానా బీభత్సం చేస్తున్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు.వెలుగు పల్లి గ్రామానికి చెందిన అక్కెనపల్లి వెంకటమ్మ ఇంటి ముందు  పని చేసుకుంటుండగా కోతులు ఇంట్లో జరపడ్డాయని ఇంట్లోకి వెళ్ళగా కోతులు తనపై దాడి చేసి చేయి పై కరిచిందని ఆవేదనగా తెలిపారు .ఇంట్లో ఎవరు లేని సమయంలో జొరబడి ఆహార పదార్థాలను ఎత్తుకెళుతున్నాయని వాటిని వెళ్ళగొట్టబోతే మీద పడి కరుస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు కోతుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు ఒంటరిగా వెళ్లాలంటే కోతులు ఎక్కడ మీద పడి కరుస్తాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు వెంట వెళ్లాల్సి వస్తుందని తిరిగి పాఠశాల నుండి తీసుకురావాల్సి వస్తుందని అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గ్రామాల్లో కోతుల బెడదను తొలగించాలని లేని పక్షంలో రోజురోజుకు పెరుగుతున్న కోతుల సంఖ్యతో జనజీవన స్రవంతి అతలాకుతలం కాక తప్పదని ప్రజలు అంటున్నారు.