ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఓవర్ టేకింగ్!

ముగ్గురి ప్రాణాలు బలిగొన్న ఓవర్ టేకింగ్!

ముద్ర, నెల్లూరు: ముందు వెళుతున్న ఒక లారీని ఓవర్ టేక్ చేయిబోయిన సమయంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నెల్లూరు జిల్లా కావలి మసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతులను పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కల్యణి, రాజీ, కుమార్ లుగా గుర్తించారు. వీరంతా చెన్నై నుంచి కొయ్యం గూడెం తిరిగి కారులో వెళ్తుండగా, కావలి మసునూరు టోల్ ప్లాజా సమీపంలో ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్ చేయడానికి ప్రయత్నించినపుడు ప్రమాదవశాత్తూ ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు డీకొంది. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.