‘పల్లా’ కోసం ‘పాగాల’
ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని గెలిపించాలని కోరుతూ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో 3వ వార్డు కౌన్సిలర్ సుధా సుగుణాకర్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పల్లాను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రాజమౌళి, 3వ వార్డు అధ్యక్షుడు అబ్బాస్, ప్రధాన కార్యర్శి అంబటి రాజయ్య, నాకయకులు బక్క నాగరాజు, అంజాజీ, ఖాదర్, విష్ణుమూర్తి, బుచ్చయ్య, శ్రీనివాస్, రాజేశ్ వంశీ, బక్క రవి పాల్గొన్నారు.