సావిత్రిబాయికి ఘన నివాళి

సావిత్రిబాయికి ఘన నివాళి

ముద్ర, జనగామ టౌన్‌: జనగామ జిల్లా చౌడారం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం సావిత్రి బాయిపూలే వర్ధంతిని నిర్వహించారు. సావిత్రి బాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కళ్లెం గ్రామం దళిత రత్న అవార్డు గ్రహీత మబ్బు పరశురాం హాస్టల్‌లో చదువుతున్నా పదో విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రాణి, ఫౌండేషన్ అధ్యక్షుడు యాసారపు కరుణాకర్, చౌడారం బర్త్‌ డే ట్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్క విష్ణు, 6వ వార్డు మెంబర్ యాసారపు కృష్ణంరాజు, టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.