దొంగతనం కేసు చేదించిన షాబాద్ పోలీసులు
![దొంగతనం కేసు చేదించిన షాబాద్ పోలీసులు](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640b366a75eb0.jpg)
ముద్ర: షాబాద్,- షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోతుగల్ లో బంగారు నగల దొంగతనం కేసు ని షాబాద్ పోలీసులు చేధించా రు.
షాబాద్ ఇన్స్పెక్టర్ గురువయ్య గౌడ్ వివరాల ప్రకారం పోతుగల్ గ్రామానికి చెందిన కేశపల్లి సుజాత భర్త కేశపల్లి నర్సింహా రెడ్డి, మార్చి 4వ తారీఖు నాడు రాత్రి ఆమె తన కొడుకుతో కలిసి గులాబి పూలు తెంపేందుకు వ్యవసాయ భూమికి వెళ్లి, వారు ఇంటికి వచ్చేసరికి ఆ సమయానికి అదే గ్రామానికి చెందిన కేశపల్లి నవీన్ రెడ్డి, వారి కాంపౌండ్ వాల్ దూకి వెళ్లిపోయాడు అని పక్కింటి వారు తెలిపినారు.
కేశపల్లి సుజాత ఇంట్లోకి వెళ్ళి చూడగా అల్మార తెరిచి చూడగా 4 తులాల నెక్లెస్ కనపడలేదు. ఇట్టి విషయంపై షాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగ షాబాద్ ఇన్స్పెక్టర్ గురువయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా కేశపల్లి నవీన్ రెడ్డి అరెస్టు చేసి అతని దగ్గర నుండి దొంగలించబడిన 4 తులాల నెక్లెస్ ని రికవరీ చేసి, నిందితుడు అయిన కేశపల్లి నవీన్ రెడ్డి నీ శుక్రవారం జుడీష్యల్ కస్టడీ నిమిత్తం చేవెళ్ల కోర్ట్ లో హాజరుపరిచినారు.