సూర్యాపేటలో చట్ట ప్రకారం ప్రజలకు న్యాయం జరగడం లేదు  మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు 

సూర్యాపేటలో చట్ట ప్రకారం ప్రజలకు న్యాయం జరగడం లేదు   మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేటలో చట్ట ప్రకారం ప్రజలకు న్యాయం జరగడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తున్నారని అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం కాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి రాజ్యాంగం సూర్యాపేటలో నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో  ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి పాలన కొనసాగుతుందని, సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ సూసైడ్ స్పాట్ గా మారిందన్నారు.

టెండర్లు లేకుండానే జగదీష్ రెడ్డి ఆదేశానుసారం రోడ్లు వేస్తున్నారని, జిల్లా అధికారులు ఇష్టానుసారంగా మినరల్ ఫండ్ ను వాడుకుంటున్నారన్నారు. అక్రమ సంపాదనతో కాంగ్రెస్ బిజెపి నాయకులను మంత్రి కొనుగోలు చేస్తున్నారని నాయకులు వాళ్ల దగ్గర ఉంటే ఓటర్లు బిజెపి దగ్గర ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలని ఎవరిని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా సూర్యాపేటలో గెలిచేది బిజెపి ఆని  ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు  కర్నాటి కిషన్ కట్కూరి కార్తీక్ రెడ్డి చల్లమల్ల నరసింహ ఆబిద్ తదితరులు పాల్గొన్నారు