పదర మండల కేంద్రంలో వలస కూలీ ఆత్మహత్య

పదర మండల కేంద్రంలో వలస కూలీ ఆత్మహత్య

ముద్ర, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పదర మండల కేంద్రంలో చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వలస కూలి రేంక(19) అనే యువతి శనివారం ఉదయం ఆత్మహత్య కు పాల్పడింది. మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఈ మేరకు పదర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు గత రెండు ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం చత్తీస్గడ్ రాష్ట్రం నుండి పదర మండల కేంద్రానికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.