న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి

న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:విజయవాడలో న్యాయవాదిగా పనిచేస్తున్న విటల్ బాబును ఆంధ్ర ప్రదేశ్ లోని అద్దంకిలో ఆయన ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా సోమవారం పట్టణంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పట్ల దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులు, హత్యల పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. న్యాయవాదుల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. తమ విధులు బహిష్కరణ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతూ సీనియర్ సివిల్ జడ్జి జిట్టాశ్యాం కుమార్ ,జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్ లకు న్యాయవాదులు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు కాల్వశ్రీనివాసరావు, జనగాం యాదగిరి, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, రమణారెడ్డి, చక్రాల వెంకటేశ్వర్లు, కొట్టు సురేష్, శనగని మహేష్, రామ లక్ష్మారెడ్డి, సైదా ,వెంకట్ రెడ్డి, వుదారి యాదగిరి ,బాలకృష్ణ కుక్కుట సైదులు ,చల్లా కృష్ణయ్య ,సురేష్ నాయక్ నరసరావు అంజయ్య, నారాయణరెడ్డి, జక్కుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.