అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సిద్దిపేట ఏసిపి సిహెచ్ దేవా రెడ్డి తెలిపారు. ఆదివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కేసు పూర్వపరాలను వివరించారు.సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం రంగ దాంపల్లి గ్రామానికి చెందిన మల్లం శ్రీనివాస్ జిల్లా బిజెపి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గా పని చేస్తూ సమీప గ్రామ యువతిని ఇంస్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకొని లోపర్చుకున్నాడని తెలిపారు .

పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలుస్తూ మోసం చేయడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా నిందితున్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో త్రీటౌన్ సిఐ భాను ప్రకాష్ పాల్గొన్నారు.