గూడూరులో అయ్యప్ప సన్నిధానం నిర్మాణానికి శంకుస్థాపన

గూడూరులో అయ్యప్ప సన్నిధానం నిర్మాణానికి శంకుస్థాపన

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో అయ్యప్ప సన్నిధానం నిర్మాణానికి సోమవారం సర్పంచి గడ్డం బాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని అయ్యప్పస్వాముల విజ్ఞాపనల మేరకు సన్నిధానం నిర్మాణానికి ఆయనే స్థలాన్ని కేటాయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచి బాల్ రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమలో గూడూరు గ్రామ అయ్యప్పసేవా సమితి అధ్యక్షుడు శివకోటి పూర్ణాచారి, ఉపాధ్యక్షుడు అంకార్ల రమేష్, ప్రధాన కార్యదర్శి బింగి శ్రీనివాస్, కోశాధికారి కొంత భూపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి గడ్డం భాను ప్రకాష్ రెడ్డితో పాటు పలువురు అయ్యప్ప మాలధారులు పూజాదికాలు నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అయ్యప్ప సన్నిధానం నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన సర్పంచి బాల్ రెడ్డికి అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపారు.