చర్చి వద్ద తప్పిపోయిన పాప.. పోలీసుల ద్వారా అప్పగింత

చర్చి వద్ద తప్పిపోయిన పాప.. పోలీసుల ద్వారా అప్పగింత

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ చర్చి వద్ద తప్పిపోయిన రెండేళ్ల పాపను సందర్శకులు పట్టణ పోలీసులకు అప్పగించగా, పోలీసులు ఆచూకీ కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగించారు. సోమవారం కొత్త సంవత్సరం సందర్బంగా మెదక్ చర్చి సందర్శనకు కామారెడ్డికి చెందిన లక్ష్మీనారాయణ, సుజాతలు కూతురు సంకీర్తనతో కలిసి సోమవారం సాయంత్రం వచ్చారు.

చర్చి వద్ద ఫోటోలు దిగే సమయంలో పాప సంకీర్తన మిస్ అయ్యింది. ఏడుస్తున్న పాపను అక్కడే ఉన్న రమేష్, జ్యోతి దంపతులు గమనించి వెంటనే టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ పాప ద్వారా వివరాలు కనుక్కొని తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించి అప్పగించడంతో సంతోషం వ్యక్తం చేశారు.