గవర్నర్ ను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు

గవర్నర్ ను కలిసిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధుల బృందం హైదరాబాద్ లోని రాజభవన్ లో గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను గవర్నర్ కు వివరించారు.

దీనిపై తమిళసై స్పందిస్తూ సేవలను మరింత విస్తరిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అనంతరం చేతితో తయారుచేసిన గవర్నర్ ఫోటో తో కూడిన జ్ఞాపకను అందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ వుట్కూరి రాధాకృష్ణారెడ్డి, ఫార్చ్యూన్ మెడికేర్ హాస్పిటల్ చైర్మన్ ముప్పిడి రాజశేఖర్ రెడ్డి, యూత్ కో ఆర్డినేటర్ యశ్వంత్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.