కిటకిటలాడిన కనకమామిడి వెంకన్న ఆలయం

కిటకిటలాడిన కనకమామిడి వెంకన్న ఆలయం

ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు సోమవారం నాడు కనకమామిడి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కనకమామిడితోపాటు పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి వెంకన్న దర్శనం చేసుకున్నారు.

ఆలయ కమిటీ చైర్మన్ కొండ లక్ష్మీకాంత్ రెడ్డి, కార్యదర్శులు కోట్ల బల్వంత్ రెడ్డి మల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి,  ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు.