సాయిచంద్ కు సీఎం కేసీఆర్​నివాళి 

 సాయిచంద్ కు సీఎం కేసీఆర్​నివాళి 

 సాయిచంద్ కు సీఎం కేసీఆర్​నివాళి 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ గాయకుడు సాయిచంద్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన సాయిచంద్‌ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు.  సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.