ED custody petition టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ పిటిషన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై నాంపల్లి కోర్టులో ఈడీ కస్టడీ పిటిషన్ వేసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ను విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి కోరింది. సెక్షన్ 50 కింద నిందితుల వాంగ్మూలం రికార్డు చేయాలన్న ఈడీ అధికారులు. మార్చి 23న సీసీఎస్ కు లేఖ రాసిన ఈడీ అధికారులు. 8 అంశాలకు చెందిన డాక్యుమెంట్స్ ఇవ్వాలన్న ఈడీ. పేపర్లీక్ కేసులో మనీ లాండరింగ్ జరగినట్లు అభియోగం. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిపై ఈడీ ఫోకస్.