తెలంగాణ ప్రజల సౌకర్యార్థం అజ్మీర్షరీఫ్ దర్గావద్ద వసతి గృహం
![తెలంగాణ ప్రజల సౌకర్యార్థం అజ్మీర్షరీఫ్ దర్గావద్ద వసతి గృహం](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6485efcd2631a.jpg)
- రెండు నెలల్లో పనులు ప్రారంభించనున్న సీసెం కేసీఆర్
- వెల్లడించిన హోంమంత్రి మహమూద్ అలీ
ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ ప్రజల సౌకర్యార్థం రాజస్థాన్లో ప్రసిద్ధి గాంచిన అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద వసతి గృహం నిర్మాణ పనులను రెండు నెల్లో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ముషీరాబాద్లోని ఏక్మినార్ చౌరస్తాలో బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బిఆర్ఎస్ మూడోసారి విజయం సాధించాలని, ముషీరాబాద్లో మరోమారు గులాబి జెండా రెపరెపలాడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, మతసామరస్యంతో కసలి మెలసి ఉండాలని కోరుతూ రాజస్థాన్ అజ్మీర్షరీఫ్ దర్గాకు సమర్పించనున్న మూడు చాదర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్అలీ, జహీరాబాద్ ఎంసీ బీబీపాటిల్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్లు పాల్గొని ప్రతేయక పార్థనలు నిర్వహించాచి వాటిని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్అలీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ వందకు పైగా సీట్లను సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో గంగా జమునా తహజీబ్ కొనసాగుతోందన్నారు. అందుకే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవనాన్ని సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలు ప్రజలను అసత్య ప్రచారాలతో మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ పటిష్టమవుతుందన్నారు. ప్రజలంతా కలసిమెలసి ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ మతసామరస్యాన్ని చాటేందుకు ఎడ్ల హరిబాబు యాదవ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఎం.ఎన్.శ్రీనివాసరావు, సయ్యద్ అహ్మదుల్లా భక్తియార్, శివముదిరాజ్, శ్రీధర్చారి, వై.శ్రీనివాసరావు, ముఠా జైసింహ, బల్లా ప్రశాంత్, ప్రభాకర్, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.