హుజూర్ నగర్ లో భారీ వర్షం... సేద తీరుతున్న ప్రజలు... 

హుజూర్ నగర్ లో భారీ వర్షం... సేద తీరుతున్న ప్రజలు... 

హుజూర్ నగర్ ముద్ర: గత కొన్ని నెలలుగా ప్రచండ భానుడి ఎండలకు ప్రజలు అల్లాడిపోయారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ప్రజలు సేద తీరారు. వాతావరణం చల్లబడింది .చల్లటి గాలులు రావటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం లోకి ఋతుపవనాలు కూడా వస్తున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిపాటి వర్షాలు రైతులకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. వరుణదేవుడు పలకరించడంతో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.