దిల్లీ లిక్కర్ స్కామ్లో గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు
![దిల్లీ లిక్కర్ స్కామ్లో గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63f9b8b3a9d39.jpg)
మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఫిబ్రవరి 8న బుచ్చిబాబును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్టు చేయగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు శనివారంతో దిల్లీ లిక్కర్ స్కామ్.. గోరంట్ల బుచ్చిబాబు కస్టడీ పొడిగింపు ముగిసింది. దీంతో బుచ్చిబాబును మరోసారి కోర్టులో హజరుపరిచిన సీబీఐ.. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించింది. మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు బుచ్చిబాబు కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా వేసింది.