మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

గొల్లపల్లి, ముద్ర:  గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు  చేశారు.అనంతరం ఎత్తు బంగారాన్ని (బెల్లం) మొక్కుచెల్లించుకున్నారు.

అంతకుముందు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి ,శాలువా తో సత్కరించి తీర్త ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అంకం మమత సతీష్, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కిషన్ ,ఎంపీటీసీ గంగన్న,మాజీ ఎంపిటిసి బీమా సత్తయ్య ,కోఆప్షన్ సభ్యులు ముత్యాల స్వామి,బిఆర్ఎస్ నాయకులు సూర్య ప్రకాష్, తిరుపతి, మల్లారెడ్డి ,మహేష్, రాజకుమార్ ,జలంధర్, అశోక్ ,శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు