ఘనంగా హరితోత్సవం...

ఘనంగా హరితోత్సవం...

ముద్ర, మల్యాల: తెలంగాణ అవతరణ, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండలంలో హరితోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ముత్యంపేట గ్రామంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సామల రేణుకదేవరాజం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ త్రినాథ్, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎమ్ లు, మహిళా సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.