అమ్మవారి దయ అందరిపై ఉండాలి: మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

అమ్మవారి దయ అందరిపై ఉండాలి: మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి

తూప్రాన్,  ముద్ర: మహంకాళి అమ్మవారి దయ అందరిపై ఉండాలని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తూప్రాన్ మున్సిపల్ పరిదిలో గల మహంకాళి, గ్రామ దేవతల అమ్మవార్ల బోనాల ఉత్సవాలలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎంపిని మున్సిపల్ చైర్మన్  రవీందర్ గౌడ్ సత్కరించారు.

అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి మహిళా కౌన్సిలర్లతో బోనాల ఊరేగింపుగా దేవాలయంకు చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. వైస్ చైర్మన్ శ్రీనివాస్, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, ఎంపీపీ స్వప్న వెంకటేష్, సర్పంచ్ ల ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్లు నారాయణ గుప్త తదితరులు పాల్గొన్నారు.