రాష్ట్రములో మెదక్ జిల్లా టాప్ 86.69 శాతం నమోదు - కలెక్టర్  రాజర్షి షా

రాష్ట్రములో మెదక్ జిల్లా టాప్ 86.69 శాతం నమోదు - కలెక్టర్  రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లాలో ఓటర్లు మరోసారి తమ చైతన్యాన్ని ఛాటారు. జిల్లాలో 86.69 శాతం నమోదైంది.మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85.3 శాతం పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 88.04 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.