సంతోష్ కుమార్ పై సెటైర్లు

సంతోష్ కుమార్ పై సెటైర్లు

ముద్ర, మల్యాల: కొండగట్టు అటవీ ప్రాంతంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై పలువురు యువకులు, వివిధ పార్టీల నాయకులు సోషల్ మీడియా, తమ పోస్ట్ ల ద్వారా సెటైర్లు వేస్తున్నారు. దాదాపు1000 ఎకరాలకు పైగా గల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీ దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే... అయితే  సంతోష్ కుమార్ వాచ్ టవర్ ఎక్కి అటవీ అందాలు వీక్షిస్తున్న ఫొటో పెట్టి, ఇదే కొండగట్టు అడవి.. ఇయ్యాల్లటికెళ్లి ఇదంతా నాదే... అంటూ పోస్టులు పెట్టడం చర్చనీయాoశమైంది.