విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

- ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, బీబీనగర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో గల మదర్ థెరిసా స్కూల్ 15వ వార్షిక వేడుకల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి గుర్తింపుని తేవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం సాంస్కృత కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో వీడిక్స్ సీఈవో సజ్జ శ్రీనివాస్ రావు, పాఠశాల కరస్పాండెంట్ ఆకుల శేషు హనుమంతరావు, ప్రిన్సిపాల్ ఆకుల కోణార్క్ రావు, మాజీ సర్పంచ్ లు కడేం లతా రాజేష్ బాబు, సుర్వి వేణు గౌడ్, శివగల్ల ఇస్తారి, మాజీ ఉపసర్పంచ్ రంగ కృష్ణవేణి గోపాల్ గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.