సాయి చంద్ మరణం పార్టీకి తీరనిలోటు - ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి 

సాయి చంద్ మరణం పార్టీకి తీరనిలోటు - ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి భువనగిరి : ప్రముఖ గాయకుడు ఉద్యమ కారుడు తన పాటలతో  తెలంగాణ ఉద్యమానికి ఆధ్యం పోసిన వ్యక్తి  రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మరణం పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు.  గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయి చంద్ మరణ వార్త తనని దిగ్ర్భాంతి కి గురిచేసిందన్నారు. ఉద్యమంలో తనది విస్మరించలేని పాత్ర అని తన ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ గడ్డ ఒక మంచి గాయకుణ్ణి కోల్పోయిందని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు.  

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ జిల్లా చైర్మన్  జడల అమరేందర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన   ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు  కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు  నాగారం అంజయ్య పాల్గొన్నారు.