సాయి చంద్ మృతి తెలంగాణకు తీరని లోటు - మంత్రి కొప్పుల

సాయి చంద్ మృతి తెలంగాణకు తీరని లోటు - మంత్రి కొప్పుల

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
సాయిచంద్ మరణవార్త తీవ్రంగా కలచి వేసింది..తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు అని అన్నారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని మంత్రి ఆ భగవంతుడిని ప్రార్థించారు.