మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు శిక్ష ...
![మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు శిక్ష ...](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6400a049612fc.jpg)
ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు...
మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసులు
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానతో పాటు జైలు శిక్ష పడుతుందని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడతూ ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసులు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిపారసు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 690 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగిందని, పాత నేరలలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ 1454 మంది వ్యక్తులకు కోర్టు ద్వారా జరిమాన లు విధించడం జరిగిందని ఎప్సి తెలిపారు. జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లదండ్రులకు బాధ్యత వహంచాలనీ హెచ్చరించారు. వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ లకు సహకరించాలని కోరారు.
అవగాహన కార్యక్రమాలు..... కౌన్సిలింగ్ లు :
తాగి వాహనాలు నడపితే జరిగే ప్రమాదాలతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు చితికిపోయే అంశాలను వీడియో ప్రొజెక్టర్పై మరియు పోలీస్ కళబృందం ద్వారా జిల్లా పోలీస్ శాఖ వారు కౌన్సిలింగ్ ద్వారా వివరించడం జరుగుతుందని ఎస్పి పేర్కొన్నారు. పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని, మద్యం సేవించి మొదటిసారి పట్టుబడిన రెండవసారి పట్టుబడిన వారు సేవించిన మద్యం మోతాదులను బట్టి తప్పనిసరిగా శిక్షలు విధించబడతాయిని, ట్రాఫిక్ నియంత్రణపైన, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపైన కఠినంగా వ్యవహరించడమే కాకుండా వారికి నిరంతరం కౌన్సిలింగ్లు ఇవ్వడం, సూచనలు చేయడం, వివిధ ఆటో స్టాండ్లో ఉన్న డ్రైవర్లకు నియమ నిబంధనలు వివరించడం, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై పాటించాల్సిన నియమాలు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.