1 .50 లక్షల ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణ 6వ వార్డు కి చెందిన చింత రాజు వెన్నెముక సంబంధిత వ్యాధి తో భాద పడుతూ ఉండగా స్థానిక నాయకులు విషయాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకు వచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 1 .50 లక్షల ఎల్ ఓ సి ని రాజు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే అందించారు. ఎల్ ఓ సి మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు రాజు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోలగానీ సత్యం, నీలి ప్రతాప్ తదితరులు ఉన్నారు.