హైకోర్టు లైజనింగ్ అధికారిగా  ఎం.డి.వకీల్

హైకోర్టు లైజనింగ్ అధికారిగా  ఎం.డి.వకీల్

 ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రభుత్వ శాఖలకు హైకోర్టు లైజనింగ్ అధికారిగా.. నాయబ్ తహశీల్దార్ మహమ్మద్ వకీల్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషాప్ ఉత్తర్వులు జారీచేశారు. జగిత్యాల అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నాయబ్ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న వకీల్ తెలంగాణ రెవెన్యూ ఎంప్లొయ్ సర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడుగా, టీ ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ గా ఉద్యోగుల సంక్షేమం,సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు.

ఆయన నియామకం పై కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, ట్రెసా రాష్ట్ర కార్యదర్శి కాళీ చరణ్, జిల్లా ఉర్దూ అధికారి కాళీమోద్దీన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్,టీ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి, ట్రెసా జిల్లా కార్యదర్శి చెలుకల కృష్ణ, నాల్గవ తరగతి టీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత ముజాహిద్ ఖాన్,  ట్రెసా, టీఎన్జీఓ, టీ పెన్షనర్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు అభినందించారు.