నష్టం లేదని చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు..

నష్టం లేదని చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు..
  •  వాళ్ల వల్ల పార్టీకి నష్టం లేదు..
  •  కార్యకర్తలు ఇంకా ఉత్సాహంతో పని చేయండి..

 సత్తుపల్లి ముద్ర (నవంబర్ 11) కాంగ్రెస్ ఇచ్చిన పదవులతో నిన్నటి వరకు ముఖ్యమంత్రితో సహా బీఆర్ఎస్ తీరును ఎండగట్టిన వ్యక్తులు కొందరు పార్టీ మారడం వల్ల కాంగ్రెస్ కు వచ్చే నష్టం ఏదీ లేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రాండ్ మౌలాలి, ఎస్.కె మున్వర్ హుస్సేన్  పేర్కొన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా ఇంకా ఉత్సాహంతో పని చేయాలని కోరారు. వాళ్లు స్వతహా ఈ నియోజకవర్గం వాళ్ళు కాదని, వలస పక్షుల్లా  ఎన్నికల సమయంలో వచ్చి వెళ్ళినంత మాత్రానా క్యాడర్ వాళ్లతో వెళుతుందని భావించాల్సిన అవసరం లేదన్నారు. కార్యకర్తలు అధైర్య పడకుండా కాంగ్రెస్ ను గెలిపించి పార్టీ మారిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా కష్టపడాలని కోరారు. శనివారం గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ విడుదల చేసిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఓటర్ కు వివరించారు.