సూర్యాపేట శాసనసభ ఎన్నికల్లో నైతిక విజయం నాదే

సూర్యాపేట శాసనసభ ఎన్నికల్లో నైతిక విజయం నాదే
  • మాజీ మంత్రి, సూర్యపేట నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఇటీవల జరిగిన సూర్యాపేట శాసనసభ ఎన్నికల్లో నైతిక విజయం తనదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సూర్యపేట నియోజకవర్గం ఇంచార్జ్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు ఆదివారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి గెలుపు కంటే వ్యతిరేకంగా వచ్చిన ఓట్లే ఎక్కువ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా నేనే 5 సంవత్సరాలు ఉంటానని,నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం అని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.

6 గ్యారంటీలు పకడ్బందీగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం ఆని,సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఆరు గ్యారంటీలో నిన్న రెండు గ్యారెంటీలను అమలు చేశాము ఆని వివరించారు. జగదీష్ రెడ్డి 10 సంవత్సరాలుగా బాధ్యతలు చేపట్టిన విద్యుత్ శాఖలో 85వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.దీనికి మొదటి బాధ్యతల కేసీఆర్, రెండో బాధ్యతల జగదీష్ రెడ్డి వహించాలని,బాధ్యులైన కేసీఆర్, జగదీష్ రెడ్డి లపై అధికారులు సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అని వెల్లడించారు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ జూనియర్ కళాశాల, భానుపురి యూనివర్సిటికి ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తాం అని స్పష్టం చేశారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, కలెక్టరేట్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపిస్తాం అని,మెడికల్ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన జగదీష్ రెడ్డి మేనమామ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తూ నిరుద్యోగుల నుండి 63లక్షల 60వేలు  వసూళ్లు చేసి ఉద్యోగం , డబ్బులు తిరిగి ఇవ్వకుండా అవినీతికి పాల్పడ్డాడని దానిపై తగిన విచారణ జరిపిస్తాం ఆని స్పష్టం చేశారు.కూరగాయల మార్కెట్ వ్యాపారులకు అనుగుణంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను వ్యాపారులకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం అన్నారు.జిల్లా కేంద్రంలో రియాల్టర్లు అక్రమంగా భూములు ఆక్రమించారని వారిపై విచారణ చేసి అట్టి భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతాం ఆని వెల్లడించారు.కొన్నిచోట్ల టిఆర్ఎస్ నాయకులకు కేటాయించిన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేసి అర్హులైన పేదలకు వాటిని అందించేలా కృషి చేస్తాం ఆని హామీ ఇచ్చారు.పదేండ్ల కాలంలో నియోజకవర్గంలో జరిగిన ప్రతి అవినీతిపై విచారణ చేపడుతామని అన్నారు.24 గంటల పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.పట్టణంలో పాత రహదారి విస్తరణలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తాననీ,నేను ఎన్నికల ముందు సూర్యాపేట ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాననీ,వాటిని నెరవేర్చదానికి ముఖ్యమంత్రితో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.

సూర్యాపేటలో కొంతమంది రియల్టర్ వ్యాపారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యాపారం చేశారని ,అట్టివారిపై కఠిన చర్యలు ఉంటాయనీ,ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలమధ్యనే ఉంటూ ప్రజా సమస్యలనుపరిష్కరించడానికి కృషి చేస్తాననీ, సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తాననీ,తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే వివిధ శాఖలో ఫైల్స్ మాయం కావడం చాలా దురదృష్టకరం ఆని అని,వాటిపై విచారణ చేపట్టి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.గత ప్రభుత్వంలో  జరిగిన అవినీతిని అక్రమాలను వెలికి తీసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా చూస్తాం అని,తెలంగాణ విద్యుత్ సంస్థలో 85 వేల కోట్ల బకాయిలకు బాధ్యులైన కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి,విద్యుత్ అధికారులు పై తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలనీ,రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టి బాధ్యులైన అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని జైలుకు పంపే వరకు పోరాడుతాం అని,నియోజకవర్గ సమస్యల పట్ల అందరం కలిసికట్టుగా పనిచేస్తాం అని,దళితబందు, బీసీ బందులో జరిగిన అవినీతి విచారణ  జరిపించి అక్రమాలకు పాల్పడిన చర్యలు తీసుకునేలా చూస్తాం అని,5 సంవత్సరాలు రాజకీయ కక్షలకు అవకాశం లేకుండా ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దామోదర్ రెడ్డి వివరించారు.

ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు కొప్పుల వేణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కోతి గోపాల్ రెడ్డి, ధరావత్ వీరన్న నాయక్, తూముల సురేష్ రావు, కందాల వెంకట్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్, పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ప్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, రాష్ర్ట పీసీసీ అధికార ప్రతినిధి  చకిలం రాజేశ్వర్ రావు, ఎస్సీసెల్ రాష్ర్ట వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్,  బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలు గౌడ్, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, నాగుల వాసు, డీ ఆర్, సాయి నేత,ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.