బిజెపికి ఒక అవకాశం ఇవ్వండి అవినీతి రహితంగా పరిపాలిస్తాం

బిజెపికి ఒక అవకాశం ఇవ్వండి అవినీతి రహితంగా పరిపాలిస్తాం

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే అవినీతి రహిత పాలన అందిస్తామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం సూర్యాపేట పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యాపారులకు సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా పరిపాలన అందిస్తామని దోపిడీదారులు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు జానయ్య కబ్జాలలో మంత్రికి వాటా లేకపోతే ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దండుపాళ్యం ముఠాను జగదీశ్వర్ రెడ్డి తన నయీమ్ ముఠాలో చేర్చుకున్నారని ఆరోపించారు.

జానయ్య కబ్జాలలో వాటాలు పంచుకున్నంతసేపు ఏ గొడవ లేదనీ,జానయ్య రాజకీయ పదవి అడగగానే కేసులు పెట్టినారనీ,ఈ కేసులు 9 సంవత్సరాల క్రితం పెట్టవలసినవి అన్నారు. గుట్టలు ,ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారు, ప్రభుత్వ భూములలో వెంచర్లు, కాలువ పై నిర్మాణం చేసి సెటర్లు వేసిన వారు, ఉండుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 8 ఎకరాల భూమిని దోచుకున్నవారు, ప్రభుత్వ భూమి నీ వెంచర్ లో కలిపి ఎంపీ నిధులతో సిసి రోడ్డు వేయించుకున్నవారు అందరూ నీ వెంటే ఉన్నారు వారిపై చర్యలు ఎందుకు లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు కర్నాటి కిషన్ గజ్జల వెంకటరెడ్డి సలిగంటి వీరేంద్ర చల్లమల్ల నరసింహ, అంతటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు