పేద కుటుంబానికి ఆర్థిక సహాయం 

పేద కుటుంబానికి ఆర్థిక సహాయం 

మఠంపల్లి ,ముద్ర: మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండాకు చెందిన బానోతు భాంగ్య కుటుంబానికి నిత్యావసర వస్తువులు, ఆర్ధిక సహాయాన్ని మాజీ యం పి టీ సి భూక్య నాగు నాయక్ ఆదివారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ యం పి టీ సి వీణా నాయక్,వార్డు సభ్యుడు బానోతు కిషోర్ నాయక్,గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు రవి నాయక్,కృష్ణా నాయక్,రంగా నాయక్,వంశీ,బాలకృష్ణ, హాము, కోటేశ్,నరసింహ, అమృ పాల్గొన్నారు.