కాంగ్రెస్ సభకు గండిపేట కార్యకర్తలు

కాంగ్రెస్ సభకు గండిపేట కార్యకర్తలు

ముద్ర విలేఖరి, రాజేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు గండిపేట్ మండలం నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పి. కిషన్, గండిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాతం అశోక్ యాదవ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందని విమర్శించారు. సీనియర్ నాయకులు గండయ్య ముదిరాజ్, శిశుపాల్ సింగ్, జల్లి వెంకటేష్, వేణు గౌడ్, రాము, డిజె కిరణ్ తదితరులు పాల్గొన్నారు.