కెసిఆర్ ను పరామర్శించిన కడియం

కెసిఆర్ ను పరామర్శించిన కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం పరామర్శించారు. ప్రమాదవశాత్తు కింద పడి తుంటి ఎముక విరిగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ ను ఎమ్మెల్యే శ్రీహరి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉన్నారు.