Land Grab Case - భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు

Land Grab Case -  భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిపై భూకబ్జా కేసు నమోదు

ముద్ర,తెలంగాణ:- భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో భూకబ్జా కేసు నమోదు అయింది. తుర్కయాంజల్‌లోని సర్వే నెంబర్ 501లో.. 200 గజాల ప్లాట్ కబ్జా చేశారని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసింది.

దీంతో ఆదిభట్ల పీఎస్‌లో సెక్షన్ 447, 427, 506 కింద చామల కిరణ్‌ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్లాటును కిరణ్‌ కుమార్‌ రెడ్డి 2003లో, రాధిక 2015లో కొన్నట్లు డాక్యుమెంట్లు ఉన్నాయని సీఐ తెలిపారు. ఇద్దరి డాక్యుమెంట్లు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.